News March 15, 2025
KMR: మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP

లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్కు పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని KMR జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం ఆయన భరోసా సెంటర్ను సందర్శించారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర న్యాయానికి కృషి చేస్తున్నామన్నారు. బాధితులు భరోసా సెంటర్కి రాగానే.. తక్షణమే సూచనలు, సలహాలతో పాటు సహాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు.
Similar News
News September 17, 2025
మావోయిస్టు పార్టీ లేఖపై అనుమానాలు!

ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజైన లేఖపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి వరకు ఇలా సంతకం, ఫొటోతో లేఖ రిలీజ్ కాలేదు. AUG 15వ తేదీ అని ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామనే ప్రకటన ఇంత సులభంగా ఉండదు. దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది’ అని చెబుతున్నారు. మరోవైపు ఈ లేఖను వెరిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News September 17, 2025
తిరుగుబాటుకు తొలి అడుగు వీర బైరాన్పల్లి

రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, తిరుగుబాటును ప్రారంభించిన తొలి గ్రామం వీర బైరాన్పల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణలో ఇంకా పోరాటం కొనసాగుతున్న ఆ సమయంలో.. పొరుగు గ్రామాలను దోచుకెళుతున్న రజాకార్లను ధైర్యంగా అడ్డుకుంది. 126 మంది వీరుల త్యాగానికి నిదర్శనంగా ఉన్న అమరవీరుల స్తూపం ఇక్కడ నెలకొంది.
News September 17, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.