News March 15, 2025

KMR: మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP

image

లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్‌కు పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని KMR జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం ఆయన భరోసా సెంటర్‌ను సందర్శించారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర న్యాయానికి కృషి చేస్తున్నామన్నారు. బాధితులు భరోసా సెంటర్‌కి రాగానే.. తక్షణమే సూచనలు, సలహాలతో పాటు సహాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు.

Similar News

News November 14, 2025

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

image

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిశోర్‌కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్‌కు దక్కింది.

News November 14, 2025

బెల్లంపల్లి: పెద్దపులి దాడిలో ఆవు మృతి

image

బెల్లంపల్లి మండలం బుగ్గగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులో ఆవుపై దాడి చేసిన హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఆవు బుగ్గగూడ గ్రామానికి చెందిన ఎల్లక్కదిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News November 14, 2025

సంగారెడ్డి: జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు

image

సంగారెడ్డి జిల్లా వైద్య అధికారిగా డాక్టర్ వసంత రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల నుంచి బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు.