News March 15, 2025
KMR: మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP

లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్కు పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని KMR జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం ఆయన భరోసా సెంటర్ను సందర్శించారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర న్యాయానికి కృషి చేస్తున్నామన్నారు. బాధితులు భరోసా సెంటర్కి రాగానే.. తక్షణమే సూచనలు, సలహాలతో పాటు సహాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు.
Similar News
News November 19, 2025
SRCL: ఆర్టీసీ డ్రైవర్పై దాడి హేయమైన చర్య: మంత్రి పొన్నం

రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన <<18333594>>దాడిని<<>> రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్పీని ఆదేశించారు.
News November 19, 2025
ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.
News November 19, 2025
MNCL: తీన్మార్ మల్లన్నతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల భేటీ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో గురువారం ఇటీవల నూతనంగా నియమితులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భేటీ అయ్యారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు.


