News March 29, 2025
KMR: మహిళా సాధికారత దిశగా వరి కొనుగోళ్లు: కలెక్టర్

మహిళా సాధికారత దిశగా కామారెడ్డి జిల్లా అడుగులు వేస్తుందని.. అందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్లో శనివారం గ్రామ అధ్యక్షులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 183 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
యూనస్ నాయకత్వం ‘బంగ్లా’కు ప్రమాదకరం: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. యూనస్ నాయకత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. మైనారిటీలపై పెరుగుతున్న దాడులు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, భారత్ సహా పొరుగు దేశాలతో సంబంధాలకు ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులకు యూనస్ ప్రభుత్వం అవకాశం ఇస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
News December 22, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పేపర్ బ్యాగ్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
* పెనాన్ని రెండు గంటలపాటు వేడినీటిలో ఉంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు వదిలి పోతుంది.
* గారెలు, బూరెలు వంటివి చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే నూనెలో కాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది.
News December 22, 2025
‘ధురంధర్’ కలెక్షన్లు ఎంతో తెలుసా?

రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూలు చేసినట్లు INDIA TODAY తెలిపింది. ఇవాళ రూ.800 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.555.5 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించి. దీంతో యానిమల్ లైఫ్ టైమ్ కలెక్షన్ల(రూ.553 కోట్లు)ను దాటేసిందని పేర్కొంది.


