News February 19, 2025

KMR: ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి: శరత్

image

రానున్న వేసవిలో కామారెడ్డి జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి NZB జిల్లా ప్రత్యేక అధికారి శరత్ అన్నారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న ఆయన KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి త్రాగునీటి పై చర్చించారు. వేసవిలో నీటి ఇబ్బందులు రాకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. అవసరమైతే..అద్దె బోర్ల నుంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు.

Similar News

News November 13, 2025

MHBD: బీసీ విద్యార్థులకు ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

image

2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 13, 2025

విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

image

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 13, 2025

విశాఖ: ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం

image

విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.82వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలకు అవకాశం లభించనుంది.