News February 19, 2025

KMR: ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి: శరత్

image

రానున్న వేసవిలో కామారెడ్డి జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి NZB జిల్లా ప్రత్యేక అధికారి శరత్ అన్నారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న ఆయన KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి త్రాగునీటి పై చర్చించారు. వేసవిలో నీటి ఇబ్బందులు రాకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. అవసరమైతే..అద్దె బోర్ల నుంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు.

Similar News

News November 6, 2025

WGL: క్వింటా పసుపు రూ.11,738

image

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.11,738 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న సైతం తరలిరాగా రెండు రోజులతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095, మంగళవారం రూ.2,055 ధర వస్తే.. ఈరోజు రూ.2,010 కి పతనమైంది. అలాగే దీపిక మిర్చి రూ.15,500 ధర వచ్చింది.

News November 6, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్ @2PM

image

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

News November 6, 2025

5 గంటలకు చెరువుకు గండి: తిరుపతి SP

image

<<18214583>>చెరువుకు గండి<<>> పడిన వెంటనే పోలీసులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయడంతో ప్రాణ నష్టం జరగలేదని తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. రాయలచెరువు ముంపు ప్రాంతాల్లో SP గురువారం పర్యటించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. ‘ఉదయం 5 గంటల సమయంలో గండి పడింది. దాదాపు 500 ఇళ్లు నీటమునిగే పరిస్థితులు ఏర్పడినా సమయోచిత చర్యలతో ప్రజలను సురక్షితంగా తరలించాం. పశువుల నష్టం జరిగిన చోట తక్షణ చర్యలు చేపట్టాం’ అని SP చెప్పారు.