News March 19, 2025

KMR: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

image

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. మార్చ్‌5 న ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 7948 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7719 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1865 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 170 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

Similar News

News October 27, 2025

రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC

image

తొలి దశ SIR(సమగ్ర ఓటర్ జాబితా సవరణ) బిహార్‌లో విజయవంతమైనట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 1951-2004 మధ్య కాలంలో 8 సార్లు SIR జరిగినట్లు వెల్లడించారు. చివరగా 21 ఏళ్ల క్రితం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను అరికట్టి, అసలైన ఓటర్లను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

News October 27, 2025

సిద్దిపేట: ‘మేఘమా.. రైతును ఆగం చేయకుమా’

image

నంగునూర్ మండలంలో మేఘాలు దోబూచులాడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పనులు మానుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉంటున్నారు. వాన కురిసినట్టే చేసి మళ్లీ ఎండ దంచి కొట్టడంతో వారం రోజులుగా వడ్లు ఎండక రైతులు గోస పడుతున్నారు. ఈ వాతావరణ మార్పులు రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయి. వడ్లు ఎండి, ఎప్పుడు అమ్ముడుపోతాయోనన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జిలాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

News October 27, 2025

HYD: ఉపఎన్నిక హడావిడిలో సర్కార్ ‘రహస్య’ అజెండా!

image

జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడిలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టింది.తమ రెండేళ్ల పాలన విజయాల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని, మిడ్ నవంబర్ కల్లా ఈపురోగతి నివేదికను కచ్చితంగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ‘రహస్య’ ఆదేశాలు జారీ చేసింది. ఈ రిపోర్ట్‌పై తప్ప, రాబోయే 2వారాలు లోకల్ బాడీ ఎన్నికలపైనా కూడా దృష్టి పెట్టొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు కాంగ్రెస్ ఆంతర్యమేంటో?