News March 19, 2025
KMR: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. మార్చ్5 న ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్నకు సంబంధించి 7948 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7719 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1865 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 170 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News December 14, 2025
శ్రీకాకుళం: సండే టాప్ న్యూస్ ఇవే

✦యువత ధర్మం పట్ల అవగాహాన పెంచుకోవాలి: ఎమ్మెల్యే మామిడి
✦నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ చెలరేగిన మంటలు
✦ పితాళినల్లూరులో ఎలుగులు హాల్ చల్
✦గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ
✦టెక్కలి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
✦రణస్థలం: వంతెన కోసం తీసిన గోతిలో పడి బైకర్ మృతి
✦లావేరు: ప్రమాదకరంగా మలుపులు
✦నరసన్నపేట పోలీస్ స్టేషన్కు ఎస్ఐ లేరు
News December 14, 2025
సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.
News December 14, 2025
FLASH: రామన్నపేటలో కాంగ్రెస్కు జై!

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీలో ఓటర్లు కాంగ్రెస్కు జైకొట్టారు. హస్తం బలపర్చిన అభ్యర్థి గరిక సత్యనారాయణ భారీ విజయం సాధించారు. సమీప అభ్యర్థులు మిర్యాల మల్లేశం(BRS), నకిరేకంటి నరేశ్(BSP)పై గెలుపొందారు. ఆయన 409 ఓట్లు రాబట్టారు. RPTలో సీనియర్ నాయకులను అందర్నీ కలుపుకొని ఆయన విజయతీరాలకు చేరారు. ఓటర్లకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


