News April 4, 2025
KMR: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు: SP

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరంమని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లను ఇప్పటి వరకు గుర్తించినట్లు తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలని సూచించారు.
Similar News
News April 20, 2025
ICICIకి రూ.13,502 కోట్ల నికర లాభం

జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ICICI ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 15.7 శాతం మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.
News April 20, 2025
నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.
News April 20, 2025
ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం