News January 19, 2025
KMR: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ శనివారం తెలిపారు. జిల్లాలో 6 గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 15, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2025
నల్గొండ: తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్గా బెల్లి యాదయ్య

MG యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్గా కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల పాటు బెల్లి యాదయ్య ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News February 15, 2025
అభివృద్ధి పనులు చేపట్టాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి నెల చివరి వారంలో పూర్తి చేసే విధంగా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.