News February 12, 2025

KMR: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.

Similar News

News February 13, 2025

ములుగు: ఇసుక అక్రమ రవాణాపై ఎస్పీ నజర్

image

ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లో రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన చట్ట ప్రకారం జరిమానా, కేసులు నమోదు చేయాలన్నారు.

News February 13, 2025

MNCL: జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులు

image

జాతీయ ఉపకార వేతనాలకు(NMMS) జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని HM రాజన్న తెలిపారు. ఈ 11 మంది విద్యార్థులకు ఏటా రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్కాలర్షిప్ పరీక్షల్లో విజయం సాధించిన 11 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

News February 13, 2025

సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ 3రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. కొద్దిరోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిని పట్టుకున్నారు. వీరికి రూ.8వేల జరిమానా విధించగా.. ముగ్గురికి జైలు శిక్ష విధించారు.

error: Content is protected !!