News February 12, 2025
KMR: యాక్సిడెంట్లో వ్యక్తి మృతి

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ రమేశ్ పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News November 17, 2025
ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News November 17, 2025
డిసెంబర్లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.


