News March 4, 2025
KMR: యాసంగికి సాగు నీరివ్వాలి: సీఎస్

యాసంగి సాగు నీటి సరఫరా, గురుకులాల సందర్శనపై CS శాంతి కుమారి అధికారులతో సోమవారం విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో పాటు అధికారులు పాల్గొన్నారు. యాసంగి పంటకు రానున్న పది రోజులు చాలా కీలకమని, విద్యుత్తు సరఫరా అవసరమైన మేర నీరు పంట పొలాలకు చేరేలా చూడాలని CS శాంతి కుమారి ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్కు దీప్తి పెయింటింగ్

జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి పెయింటింగ్ను హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్కు వేశారు. పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును సైతం దీప్తి సొంతం చేసుకుంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో భాగంగా రెండు స్వర్ణాలను సాధించింది. దీంతో ప్రభుత్వం ఆమె పెయింటింగ్ను పిల్లర్పై వేయించింది.
News October 27, 2025
డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.
News October 27, 2025
జూబ్లీహిల్స్లో అభ్యర్థులకు రకరకాల గుర్తులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు ఉండగా వారికి ఎన్నికల అధికారులు వివిధ గుర్తులను కేటాయించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో యాపిల్, ద్రాక్ష, గాలి కొట్టే పంపు, బెలూన్, బేబీ వాకర్, కూలర్, టీవీ రిమోట్, బెల్ట్ తదితర గుర్తులను కేటాయించారు. అయితే ఈ గుర్తులను అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.


