News April 3, 2025
KMR: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు పొడిగింపు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకం ప్రయోజనాలు ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: అంకుర ఆసుపత్రి ఆధ్వర్యంలో 5కే రన్

గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంకుర ఆసుపత్రి ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సౌజన్యంతో ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డా.చల్లగుళ్ల రాకేశ్, డా.టి.శ్రీనిధి పర్యవేక్షణలో లకారం ట్యాంక్ బండ్ నుంచి ఆసుపత్రి వరకు ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా గర్భిణుల సంరక్షణ, నవజాత శిశువుల ఆలనా పాలనా గురించి వారు వివరించారు. ప్రముఖ టీవీ యాంకర్ రవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
News November 16, 2025
జిల్లాలో లాటరీ మోసాలపై ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి లాటరీల పేరుతో జరిగే ఆర్థిక మోసాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ‘1000 కట్టు.. ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత పథకాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకునే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. లాటరీల రూపంలో భూములు, ఫ్లాట్లు అమ్మడం చట్టవిరుద్ధం అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
News November 16, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయారు!

HYD ట్రాఫిక్ పోలీసులు NOV 14, 15న చేసిన ప్రత్యేక డ్రైవ్లో 457 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. 377 బైక్లు, 27 మంది 3 చక్రాలు, 53 మంది 4 చక్రాలు & ఇతర వాహనాలు ఉన్నాయి. BAC స్థాయిల ప్రకారం మొత్తం కేసులు ఇలా ఉన్నాయి: 30–50 మధ్య 83 కేసులు, 51–100 మధ్య 194, 101–150 మధ్య 104, 151–200 మధ్య 44, 201–250 మధ్య 14, 251–300 మధ్య 14, 300 పైగా 4 D&D కేసులు నమోదు చేశారు.


