News March 20, 2025
KMR: రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ అంశాల్లో మెన్, ఉమెన్ సెలెక్షన్స్ నిర్వహించగా.. 18 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరూ.. ఈ నెల 23న గార్డియం స్టేడియం కొల్లూరు, HYDలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి అనిల్ తెలిపారు.
Similar News
News March 21, 2025
బ్రాహ్మణుడు లేని ఆదర్శ వివాహాలు జరగాలి: యాదగిరి

సమాజంలో ఆదర్శ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు మరిన్ని జరగాలని పాశం యాదగిరి, పలవురు వక్తలు అభిప్రాయపడ్డారు. SVKలో నాగర్కర్నూల్కు చెందిన వెంకటేశ్ (ఎస్సీ) మంచిర్యాలకు చెందిన హారిక (ఎస్టీ) ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షతన బ్రాహ్మణుడు, మంత్రాలులేని ఆదర్శ వివాహం జరిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాట పాడి అలరించారు.
News March 21, 2025
ఇక రచ్చే.. రేపే IPL ప్రారంభం

ధనాధన్ క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. రేపు IPL 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో KKR, RCB పోటీ పడనున్నాయి. మండు వేసవిలో రెండు నెలలపాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడిసి మురిసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చకుండా పైసా వసూల్ వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. స్టార్స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో మ్యాచ్లను వీక్షించవచ్చు.
News March 21, 2025
జస్టిస్ వర్మపై అభిశంసనకు సిద్ధంగా కేంద్రం?

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు చర్యలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆయనపై అత్యున్నత న్యాయస్థానం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఢిల్లీ నుంచి తిరిగి పాత చోటికే బదిలీ చేసింది. ఈ నిర్ణయాలను అలహాబాద్ సహా అనేక బార్ అసోసియేషన్స్ వ్యతిరేకించాయి. కొలీజియం వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి.