News February 8, 2025
KMR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూంలను పరిశీలించారు. ప్రతీ రోజు వంట గదిని శుభ్ర పరచాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫిజికల్ ఫిట్నెస్, భోజనం, తదితర విషయాలపై ఆరా తీసి వారికి దిశా నిర్దేశం చేశారు.
Similar News
News February 12, 2026
ALERT: ఈ లింక్స్ క్లిక్ చేయకండి!

వాలంటైన్స్ వీక్ పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘సర్ప్రైజ్ గిఫ్ట్’ వంటి లింక్లను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి లేదా గ్రూపుల్లో వచ్చే లింక్స్ను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.
News February 12, 2026
నార్త్ కొరియా తదుపరి లీడర్గా కిమ్ జు ఏ?

ఉత్తర కొరియా తదుపరి లీడర్గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 12, 2026
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది డుమ్మా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ములుగు(మం) రాంచంద్రాపురం, పందికుంట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాంచంద్రపురం సబ్ సెంటర్ లో సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మెమోలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకున్నా, ప్రజలకు అందుబాటులో లేకున్నా చర్యలు తప్పవన్నారు. తర్వాత పందికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.


