News March 21, 2025
KMR: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లా లోని వైద్య విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డీసీహెచ్ఎస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, మద్నూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో 19 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామన్నారు.
Similar News
News November 11, 2025
HYD: దొరికిన రూ.1.5 లక్షలు తిరిగిచ్చాడు!

సాధారణంగా ఏదైనా వస్తువు దొరికితే, దానిని తీసుకెళ్లే నేటి రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మహానుభావుడు గరీబ్రాత్ ఎక్స్ప్రెస్ రైలులో తనకు దొరికిన రూ.1.5 లక్షల నగదును పోలీసులకు అప్పగించాడు. తన మంచితనం, నిజాయితీని చూసి పోలీసులు తనను అభినందించారు. ఈ విషయం తెలిసిన పలువురు ‘ఎంతమంచి వాడవయ్యా’ అంటూ పోస్టులు చేస్తున్నారు.
News November 11, 2025
సమాజాభివృద్ధికి జ్ఞానం అవసరం: ఎస్పీ

సమాజాభివృద్ధికి జ్ఞానం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యామంత్రి, జ్ఞాన దీప్తి ప్రతీక అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. అనంరతం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గొప్ప ఇస్లామిక్ పండితుడని కొనియాడారు.
News November 11, 2025
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. టార్గెట్ DEC 2026

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. టార్గెట్ డిసెంబర్ 2026 అని GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తెలిపారు. అందుకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచి ముందుకు వెళుతున్నట్లు వివరించారు. రూ.714 కోట్లతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం వెయిటింగ్ హాల్ నిర్మాణాలు, లాంగ్ స్పేస్, ఆర్కేడ్ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి.


