News February 28, 2025
KMR: సంఖ్యాపరంగా ఎక్కువ.. ఓటింగ్ తక్కువ

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కామారెడ్డి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కాగా..టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పురుష టీచర్స్ కంటే.. మహిళా టీచర్ ఓటర్లే ఎక్కువ (1.71 % ఎక్కువ) మంది ఓటేశారు. ఇక జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మహిళా గ్రాడ్యుయేట్స్ ఓటు వేయడంలో (1.17 % తక్కువ) వెనుక పడ్డారు.
Similar News
News December 21, 2025
ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవే.. మనవెక్కడ?

ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్లో జపాన్ టాప్లో ఉంది. టోక్యోలోని ‘షింజుకు’ ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి. ఇండియా నుంచి కోల్కతాలోని హౌరా స్టేషన్ 54 కోట్ల మందితో ఆరు, సియాల్దా స్టేషన్ ఎనిమిదో ప్లేస్లో ఉన్నాయి. అధిక జనసాంద్రత, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి రద్దీ వల్లే ఈ స్టేషన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి.
News December 21, 2025
చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.
News December 21, 2025
iBOMMA రవి కేసు.. విచారణ గందరగోళం

పైరసీ వ్యవహారంలో అరెస్టైన iBOMMA రవిని టెక్నికల్ ఆధారాలతో ప్రశ్నించినా పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెబుతూ విచారణను గందరగోళంగా మారుస్తున్నాడని సమాచారం. తాను సినిమా పైరసీ ద్వారా డబ్బు సంపాదించలేదని తెలిపాడు. బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సంపాదించానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ యాప్ యజమానుల వివరాలను చెప్పలేదు. ఐబొమ్మ సైట్లో పనిచేసిన సిబ్బంది వివరాలపై కూడా మౌనం వహించాడు.


