News February 3, 2025
KMR: సబ్ జైలును సందర్శించిన సౌమ్య మిశ్రా

కామారెడ్డి సబ్ జైలును ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ DG సౌమ్య మిశ్రా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీల యోగక్షేమాలను భోజన వసతులు, న్యాయ సేవ, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పలు రికార్డులను పరిశీలించారు. జైలులో గార్డెనింగ్, పరిశుభ్రత నిర్వహణపై అధికారులకు అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News December 8, 2025
NSU లైంగిక వేధింపుల ఘటన.. ఒడిశా వెళ్లిన CI

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసులో విచారణ నిమిత్తం వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీ మోహన్ తన బృందంతో ఒడిశాకు వెళ్లారు. యువతి కుటుంబ సభ్యులు ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో యూనివర్సిటీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కాగా యువతిని ఇప్పటికే బంధువుల ఇంట్లో ఉంచారని.. కేసు తమకు అవసరం లేదని వర్సిటీ అధికారులకు తల్లిదండ్రులు చెప్పినట్లు సమాచారం.
News December 8, 2025
చిత్తూరు జిల్లాలో కొత్త మోసం.. జాగ్రత్త.!

చిత్తూరులో కూరగాయలు అమ్మే ఓ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ను రూ.10వేలకు వేరే వాళ్లకు విక్రయించాడు. వాళ్లు అతని పేరుతో ఫేక్ కంపెనీ సృష్టించి ట్యాక్స్లు ఎగ్గొట్టారు. GST అధికారులు రూ.12కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసు ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు సైతం ఇలా పేదల అకౌంట్లు తీసుకుని మోసాలు చేస్తున్నారు. అకౌంట్ పేరు ఉన్నవాళ్లే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.
News December 8, 2025
అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు గమనిక

మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. అన్నమయ్య జిల్లా DEO సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 18 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవాలని సూచించారు.


