News March 6, 2025

KMR: సారీ మమ్మీ, డాడీ.. ఇక సెలవు

image

కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం కోమటి చెర్వు తండాకు చెందిన అశోక్ HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3వతేదీన ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ‘కోరుకున్న జాబ్ సాధించలేక పోయా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎపుడప్పుడూ చనిపోవాలని ధ్యాస ఒక్కటే.. ఇక సెలవు. సారీ మమ్మీ, డాడీ’ అంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు.

Similar News

News November 14, 2025

పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

image

పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గనూరే సూరజ్ ధనుంజయ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సూరజ్ ప్రస్తుతం పల్నాడు జిల్లా జేసీగా పనిచేస్తున్నారు. ఆయనను బదిలీ చేస్తూ ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నల్గొండ వాసుల ఫోకస్

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని నల్గొండ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.

News November 14, 2025

కరీంనగర్: ‘సర్కార్ దవాఖానాలో స్కాం నిజమే’

image

KNR జనరల్ హాస్పిటల్‌లో <<18278730>>రూ.4.5 కోట్ల స్కాం <<>>జరిగింది వాస్తవమేనని అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వైద్య విధాన పరిషత్ స్టేట్ ప్రోగ్రాం, అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్లు, 2 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులతోపాటు అసిస్టెంట్ ఫైనాన్స్ అధికారితో కూడిన బృందాలు జిల్లాసుపత్రిలో విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నివేదికను కమిషనర్‌కు ఇవ్వనున్నారు.