News March 6, 2025
KMR: సారీ మమ్మీ, డాడీ.. ఇక సెలవు

కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం కోమటి చెర్వు తండాకు చెందిన అశోక్ HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3వతేదీన ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ‘కోరుకున్న జాబ్ సాధించలేక పోయా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎపుడప్పుడూ చనిపోవాలని ధ్యాస ఒక్కటే.. ఇక సెలవు. సారీ మమ్మీ, డాడీ’ అంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు.
Similar News
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
పాలమూరు: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యూలర్, బ్యాక్లాగ్) డిగ్రీ పరీక్షలు నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్, మూడో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.


