News February 22, 2025

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం తన అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆరుబయట పడుకోవడంతో తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపిన లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News December 15, 2025

నిజామాబాద్: నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందించాలి

image

ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్‌లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖరు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.

News December 15, 2025

NZB: రాత్రి వరకు కొనసాగిన GP ఎన్నికల కౌంటింగ్

image

నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన GP ఎన్నికల కౌంటింగ్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కొనసాగింది. చిన్న GPల్లో సాయంత్రం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాగా 158 సర్పంచ్ స్థానాలకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీలో నిలవగా మొత్తం 2,38,838 మంది ఓటర్లకు గాను 1,83,219 మంది (76.71 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 15, 2025

NZB: వాటి వల్ల ప్రాణహాని కలిగితే హత్య కేసు: CP

image

చైనా మాంజాతో వ్యక్తులకు ప్రాణహాని జరిగితే హత్యానేరం కేసు నమోదు చేస్తామని CPసాయిచైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వాడటం ప్రమాదకరమని, ప్రజలు, జంతువులు, పక్షులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైనా మాంజా నిల్వ ఉంచినా, తయారు చేసి విక్రయించినా, ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి వద్ద అయినా చైనా మాంజా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు.