News March 23, 2025
KMR: అప్పులు తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్య

సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన సుంకరి శంకర్(51) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు చేసి తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. శంకర్ బిచ్కుంద మండలం నీరడిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
KNR: గాయత్రి పంప్హౌస్ నుంచి గోదావరి నీరు విడుదల

కరీంనగర్(M) రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్లో ‘బాహుబలి’ మోటార్లు గర్జించాయి. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకుని అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. పంప్హౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి (మిడ్ మానేరు) తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.
News February 27, 2026
అనంత: వైద్యశాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News February 27, 2026
GNT: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లు.. దరఖాస్తుల ఆహ్వానం

వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉచిత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. అర్హులైన వారు మార్చి 10వ తేదీలోగా cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టులో దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


