News February 28, 2025
KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
Similar News
News February 28, 2025
విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
News February 28, 2025
గోరంట్ల మాధవ్పై ఎస్పీకి ఫిర్యాదు

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ వ్యవహరించారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 28, 2025
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు: షర్మిల

AP: కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అంతా అంకెల గారడీ, అభూత కల్పన అని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ఇది పస లేని బడ్జెట్. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే రూ.6300 కోట్లే కేటాయించారు. తల్లికి వందనం నిధుల్లో కోత పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి ఊసే లేదు’ అని మండిపడ్డారు.