News March 15, 2025

KMR: ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గణితం 2బీ, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 5483 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 99 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1284 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 1246 మంది పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

Similar News

News November 6, 2025

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: టిప్పర్ యజమాని

image

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్‌ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.

News November 6, 2025

రంపచోడవరం అటా.. ఇటా?

image

ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు సన్నద్ధమౌతున్న వేళ రంపచోడవరం సమస్య తెరపైకి వచ్చింది. నియోజకవర్గం 2 డివిజన్‌లతో మొత్తం 12 మండలాలను కలిగి ఉంది. వీరు పాడేరు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమను పత్యేక జిల్లాగా ప్రకటించాలని కొందరు, తూ.గో.లో కలపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలతో పాటు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ఆలోచిస్తన్నట్లు సమాచారం.

News November 6, 2025

డెయిరీఫామ్‌తో రూ.15 లక్షలు నష్టపోయారు..

image

TG: రెండేళ్ల క్రితం డెయిరీఫామ్‌ ప్రారంభించి రూ.15లక్షలుపైగా నష్టపోయారు కామారెడ్డి(D) పెద్దమల్లారెడ్డికి చెందిన ఐదుగురు మిత్రులు. రూ.27 లక్షల పెట్టుబడి, 17 గేదెలతో ఫామ్‌ ప్రారంభించారు. గేదెల ఎంపికలో తప్పులు, అనుభవలేమి, ఊహించని ఖర్చులతో 6 నెలల క్రితం ఫామ్‌ మూసేశారు. అందుకే డెయిరీఫామ్ పెట్టేముందు పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ✍️ పాడి, వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.