News November 22, 2025
KMR: ఈ నెల 23న NMMS పరీక్ష: DEO

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఈ నెల 23న నిర్వహించనున్నట్లు కామారెడ్డి DEO రాజు తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి పరిధిలో 4 కేంద్రాలు, బాన్సువాడ పరిధిలో 2 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. bse.telangana.gov.in ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Similar News
News November 22, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనం నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 22, 2025
ADB: స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పలు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈవో రాజలింగు పేర్కొన్నారు. యువత సంక్షేమార్గం నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అర్హత గల సంస్థలు ngodarpan.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టెప్ కార్యాలయంలో ఈనెల 30లోపు సమర్పించాలని సూచించారు.
News November 22, 2025
‘డిజిటల్ గోల్డ్’ను నియంత్రించం: సెబీ చీఫ్

డిజిటల్ గోల్డ్, ఈ-గోల్డ్ ఉత్పత్తులు తమ పరిధిలో లేవని, వాటిని నియంత్రించాలని అనుకోవడం లేదని SEBI చీఫ్ తుహిన్ పాండే తెలిపారు. సెబీ పరిధిలోని మ్యూచువల్ ఫండ్స్ ETFలు, ఇతర గోల్డ్ సెక్యూరిటీస్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. డిజిటల్ గోల్డ్ తమ పరిధిలోకి రాదని, అది రిస్క్ అని ఇటీవల సెబీ హెచ్చరించింది. దీంతో తమనూ నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని డిజిటల్ గోల్డ్ పరిశ్రమ కోరడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.


