News March 22, 2025

KMR: ఈ నెల 31 వరకు దరఖాస్తులక అవకాశం

image

ప్రధాని మంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దేశంలోని 500 పైచిలుకు కంపెనీల్లో ఇంటర్న్‌లుగా చేరి పని అనుభవాన్ని గడిచే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Similar News

News February 27, 2026

విశాఖ: రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

image

విశాఖ రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జిల్లా కోర్టులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు సిబ్బంది మృతితో తోటి ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.

News February 27, 2026

సీఎం కప్‌లో కామారెడ్డి యువకుల విజయం

image

రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సీఎం కప్ క్యారం పోటీల్లో కామారెడ్డి జిల్లా యువకులు ప్రతిభ చాటారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో రామారెడ్డి యువకులు ప్రణయ్, రాజు, జగదీశ్ పాల్గొని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ విజేతలను అభినందించారు. జిల్లాకు మూడో స్థానం తీసుకురావడం గర్వకారణమని ప్రశంసించారు.

News February 27, 2026

SBI క్లర్క్ పోస్టులు.. మెయిన్ ఫలితాలు విడుదల

image

SBI క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 2025 నవంబర్ 21న ఈ పరీక్ష జరిగింది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT)కు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా దాదాపు 6వేలకు పైగా క్లర్క్ పోస్టులకు గతేడాది AUGలో నోటిఫికేషన్ వచ్చింది. రిజల్ట్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.