News October 8, 2025

KMR: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలి: SEC

image

ZPTC, MPTC, MPP ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.

Similar News

News October 9, 2025

10న వెంకటాచలం రానున్న CM..

image

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.

News October 9, 2025

ఖమ్మం: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

image

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News October 9, 2025

వామన్‌రావు జంట హత్యకేసులో సీబీఐ దూకుడు

image

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి జంట హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సాక్షులను ప్రశ్నించడం ప్రారంభించింది. ఇవాళ వామన్‌రావు అనుచరులు సంతోశ్, సతీశ్‌ను విచారించింది. ఆయనతో వారి ప్రయాణం, సాన్నిహిత్యంపై ఆరా తీసింది. ఈ కేసులో గత 20 రోజులుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. మొత్తం 130 మందిని అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.