News September 6, 2025
KMR: ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షణలో గణేష్ నిమజ్జనం

కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శోభాయాత్ర ప్రారంభం నుంచి టెక్రియాల్ చెరువు వరకు భద్రతా ఏర్పాట్లను SP రాజేశ్ చంద్ర స్వయంగా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనాలు, శోభాయాత్రలకు డ్రోన్ కెమెరాల సహాయంతో సమన్వయం చేశారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల మధ్య ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని SP తెలిపారు.
Similar News
News September 7, 2025
చంద్రుడిని చూశారా?

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?
News September 7, 2025
ఆదిలాబాద్: బెట్టింగ్తో జీవితం నాశనం చేసుకోవద్దు..!

ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఓ బ్యాంకు క్యాషియర్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై దొంగగా మారి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలువురు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈనెల 9న ఆసియా కప్ టీ 20 క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి బెట్టింగ్ అలవాటైతే దానిని వదిలించుకోవడం చాలా కష్టమని పేర్కొంటున్నారు.
News September 7, 2025
జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

పింఛన్ల పెంపు కోసం మంగళవారం జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని MRPS అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ పిలుపునిచ్చారు. నేడు జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, BD కార్మికులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ పెంచలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళల వివరాలను సేకరించారు.