News October 10, 2024

KMR: చిన్నపుడే అమ్మానాన్న మృతి.. వ్యవసాయం చేస్తూనే SA జాబ్

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శేఖ్ గౌస్ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే బయోసైన్స్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయినా అధైర్యపడలేదు. వ్యవసాయం చేస్తూనే ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని చూసుకున్నాడు. చివరికి ప్రభుత్వ కొలువు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీంతో మద్నూర్ గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News October 10, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్‌ కమలాకర్ రెడ్డి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్‌గా నియమితులైన బీర్కూర్ మండలం దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డిని పలువురు బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, పోగు పాండు, ఓంకార్, ఈరాజ్ సాయిలు, నర్ర సాయిలు, సమద్, సతీష్, పిర్గొండ సతీష్, రాజు, బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్‌ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ ఉన్నారు.

News October 9, 2024

NZB: సద్దుల బతుకమ్మ రేపు.. శనివారం దసరా

image

సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.

News October 9, 2024

NZB: మేమున్న చోటుకే రావాలి: డిజిటల్ సర్వే చిత్రాలు

image

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నిజామాబాద్ నగరంలో తూ తూ మంత్రంగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా 3వ డివిజన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-2లో నిన్న జరిగిన సర్వే సందర్భంగా నవీపేట్ ప్రాంతానికి చెందిన సర్వే బృందం సభ్యులు తామున్న చోటుకే సర్వే కోసం రావాలన్నారని తెలిపారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో వృద్ధులను కిందికి వచ్చి సర్వేలో కిందకు రావాలని చెప్పి వారు వెళ్లిపోయారన్నారు.