News March 28, 2025
KMR: చెట్టుకు కట్టేసి కొట్టారు (UPDATE)

దోమకొండ మండలం చింతామణి పల్లి గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. రమేశ్ అనే వ్యక్తిని పలువురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన రమేశ్ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఓ కారు అమ్మకం విషయంలో గొడవ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Similar News
News September 17, 2025
జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

జనగామ పట్టణ కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు.
News September 17, 2025
బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్లు భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బలగ పోతయ్య తెలిపారు. ఈనెల 27లోగా iti.ap.gov.in వెబ్సైట్లో టెన్త్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు 28న సర్టిఫికేట్స్ వేరిఫికేషన్కు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని పత్రాలతో రావాలన్నారు. >Share it
News September 17, 2025
పాకిస్థాన్తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

ఆసియాకప్లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.