News April 16, 2025
KMR: జిల్లాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతల తాకిడికి గురవుతోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నస్రుల్లాబాద్లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా పిట్లంలో 39.4°లుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణం భరించలేని విధంగా మారింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Similar News
News April 16, 2025
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: అ.కలెక్టర్

మునగాల మండల బరాఖత్ గూడెం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.
News April 16, 2025
ఏలూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని మృతదేహం అస్థి పంజరg స్థితిలో లభ్యమైన ఘటన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తూరు ఇందిరా కాలనీ సమీపంలో ఉన్న పంట పొలాలలో బుధవారం సాయంత్రం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెంది సుమారు నెలకు పైగా కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 16, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP: 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ క్లాసులో 25% సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం <