News April 15, 2025

KMR: జిల్లా యువతకు ఉచిత శిక్షణ!

image

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సెట్విన్ శిక్షణ కేంద్రం యువజన సేవల విభాగం నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి, విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ TTI తెలంగాణ ప్రభుత్వ కోఆర్డినేటర్ సయ్యద్ మోహిజుద్దీన్ తెలిపారు. DCA, PGDCA, టాలీ, ఫోటోషాప్, జావా, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు నం. 7386180456కు సంప్రదించాలని కోరారు.

Similar News

News September 19, 2025

మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

image

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

News September 19, 2025

RG-3: యాజమాన్యం మొండి వైఖరి వల్లే సమావేశం బహిష్కరణ

image

సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని ఏఐటియుసి బహిష్కరించారని జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్ అన్నారు. గురువారం RG-3 ఏరియా OCP-2లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయాలని, కార్మికులకు 35శాతం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైవీ రావు,MRC రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

YSR మరణంతోనే రాష్ట్ర విభజన: రాజగోపాల్‌రెడ్డి

image

YSR మరణంతోనే రాష్ట్ర విభజన జరిగిందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వెనుక ఇంటెలిజెన్స్ ఉందని, నేను పార్టీ మారుతున్నానని, మాజీ CM జగన్‌ను కలుస్తున్నానని కొందరు ప్రచారం చేశారు. నేను రాజకీయ నాయకుడిగా కాకుండా, సోదరుడిగా APకి వచ్చాను. నేను YSR అభిమానినని, ఒక మనిషి మరణిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు’ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.