News February 3, 2025

KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు

image

కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.

News February 21, 2026

ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

image

దేశ రాజధాని ఢిల్లీలో పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

News February 21, 2026

అనకాపల్లి: ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించనున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ఈనెల 22 తేదీలోగా sciencesamgra.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలని హెచ్ఎంలకు సూచించారు. ఎంపికైన ఉత్తమ సైన్స్ ప్రాజెక్ట్‌కు అవార్డులు అందజేస్తామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు అనుమతి లేదన్నారు.