News September 13, 2025
KMR: జోరుగా గంజాయి సాగు, విక్రయాలు

జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో పలువురు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. హంగర్గ గ్రామంలో కంది, ఇతర పంటలతో పాటు ఓ రైతు సాగు చేసిన 147 గంజాయి మొక్కలను సాగు చేయగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు గంజాయి సాగు చేస్తూ, పలుచోట్ల విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడక్కడా అధికారులు దాడులు చేస్తున్నపట్టికీ గంజాయి సాగు, విక్రయాలు మాత్రం తగ్గడం లేదు.
Similar News
News September 13, 2025
KNR: ఘనంగా ‘బొడ్డెమ్మ సంబురం’ ఆరంభం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ పండగ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. KNR(D) వీణవంక మం. నర్సింగాపూర్లోని హరిహర క్షేత్రం దేవస్థానంలో మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం బొడ్డెమ్మ పండగ వేడుకలను అట్టాహాసంగా ప్రారంభించారు. కాగా, ఈ వేడుకలో గౌరీ దేవీని ఆరాధిస్తామని, బొడ్డెమ్మ పండగ మట్టి, పూలతో ముడిపడిన ఓ ప్రకృతి పండగని వనితలన్నారు. మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
News September 13, 2025
కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ కలకలం

చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో మండలంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే జ్వరాలు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన నలుగురికి కొకొయ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కొత్తరెడ్డిపాలెంపై దృష్టి పెట్టింది.
News September 13, 2025
వెంకటాపూర్: 34 అడుగులకు చేరువలో రామప్ప నీటిమట్టం

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు నీటిమట్టం 33.6 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరద నీరు చేరుతుంది. సరస్వతి నీటిమట్టం 36 అడుగులు కాగా.. 35 అడుగులకు మత్తడి పడే అవకాశం ఉంది. దీంతో రెండు పంటలకు సరిపడా నీరు అందుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.