News April 24, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి

image

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ జి.ఫనింద్రరెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి PACS, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వసతులపై ఆరా తీశారు. తక్షణ ట్యాబు ఎంట్రీ, 72 గంటల్లో చెల్లింపు, తేమ శాతం, FAQ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

కామారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై చర్యలు

image

కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాన్సువాడ, పిట్లం, తాడ్వాయి, కామారెడ్డి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.

News December 31, 2025

మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

image

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.

News December 31, 2025

మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే!

image

మార్కాపురంను జిల్లాగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నూతన జిల్లా పరిధిలో ఉండే 21 మండలాలు.. గిద్దలూరు, బి పేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థ వీడు, మార్కాపురం, తర్లుపాడు, వైపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతుని పాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లో పల్లె, చంద్రశేఖరపురం, పామూరు మండలాలు ఉండనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.