News May 4, 2024
KMR: నలుగురు విలేకరులపై కేసు.. రిమాండ్కు తరలింపు
సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన నలుగురు విలేకరులపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు. పెర్కిట్ గ్రామానికి చెందిన నిఖిల్ HYD నుంచి వాహనంలో గూడ్స్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో మల్లుపేట్ వద్ద నలుగురు రిపోర్టర్లు కారులో వచ్చి సేల్స్ టాక్స్ అధికారులమని బెదిరించి రూ.3000 లాక్కున్నటక్లు DSP వెల్లడించారు.
Similar News
News October 1, 2024
అక్టోబర్ 8-10 వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జల శక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను అధికారులు పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News September 30, 2024
కామారెడ్డి జిల్లా టాపర్గా పిట్లం యువతి
సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News September 30, 2024
NZB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య ఎలా జరుపుకోవాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లావాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.