News September 15, 2025

KMR: నాటి ఇంజినీర్ల సృష్టి ఈ అద్భుతాలు!

image

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ కోట, లింగంపేట బావి, పోచారం ప్రాజెక్టులు ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. 103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన సామర్థ్యాన్ని మించి వరదను తట్టుకుని నిలబడింది. ఈ నిర్మాణాలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటూ నాటి ఇంజినీరింగ్ ప్రమాణాలను నిరూపిస్తున్నాయి. ఆనాటి ఇంజినీర్ల కృషికి ఈ కట్టడాలు నిలువెత్తు నిదర్శనం.

Similar News

News September 15, 2025

సంగారెడ్డి: నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల సెప్టెంబర్ 23లోపు https://www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు.

News September 15, 2025

GWL: బాధితుల సమస్యలు పరిష్కారానికి గ్రీవెన్స్ డే: SP

image

బాధితుల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. వీటిలో భూ వివాదాలపై 3, గొడవలకు సంబంధించి 2, ఇంటి నిర్మాణం అడ్డగింత, భర్త వేధింపులు, ఆస్తి వివాదాలపై ఒక్కొక్కటి, ఇతర సమస్యలపై 2 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

News September 15, 2025

కళాశాలల బంద్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల మార్పు..!

image

వరంగల్ జిల్లాలో ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని కళాశాలలో బంద్ నేటి నుంచి నిర్వహిస్తున్నారు. దీంతో ఈనెల 15, 17, 19వ తేదీల్లో జరగాల్సిన ఫార్ము డీ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రాలను మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాటి వివరాలు కేయూ. ఏసీ.ఇన్‌లో చూడొచ్చని, LLB ఐదేళ్ల ఆరో సెమిస్టర్ పరీక్షను సైతం సుబేదారి వర్సిటీ మహిళా కాలేజీకి మార్చమన్నారు.