News January 27, 2025
KMR: నేడే అకౌంట్లో రైతు భరోసా నగదు జమ

కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు భరోసాతో పాటు మరో మూడు పథకాలను గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ కానుంది. అయితే జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 9,062 మంది రైతులకు సంబంధించి 13,934.17 ఎకరాలకు గానూ రూ.83,522,820 నగదు జమ కానుంది. ఈ నివేదికను కలెక్టరేట్ కార్యాలయం ఆదివారం విడుదల చేసింది.
Similar News
News July 9, 2025
గిరి ప్రదక్షిణలో మాధవ స్వామి ఆలయానికి వెళ్తున్నారా..!

సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. భక్తులు ఇప్పటికే నడక ప్రారంభించారు. అయితే మాధవధారలో సింహాచలం కొండను అనుకోని ఉన్న మాధవస్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని గిరి యాత్ర కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గిరి ప్రదక్షిణ సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే మాధవస్వామి ఆలయం నుంచి మెట్ల మార్గాన సింహాచలానికి దారి కూడా ఉంది.
News July 9, 2025
NZB: GOOD NEWS.. వారికి 3 నెలల జీతాలు జమ

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 2,730 మల్టీపర్పస్ వర్కర్లకు 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 మాసాల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత GPల TGbPASS ఖాతాలలో జమ చేసిందని DPO శ్రీనివాస్రావు బుధవారం తెలిపారు. అందరూ ప్రత్యేకాధికారులు, పంచాయతి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధవహించి వెంటనే సంబంధిత మల్టీపర్పస్ వర్కర్ల వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు జమ చేయాలని ఆయన సూచించారు.
News July 9, 2025
నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు