News March 29, 2025
KMR: పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి: సీఈఓ

రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి చట్టాల అమలు, శాంతి భద్రతలు, ఓటరు జాబితా సవరణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
ఆళ్లగడ్డలో మృతదేహం లభ్యం

ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. అభిరుచి హోటల్ వెనుక ఉన్న గని గుంతలో నీటిపై తేలియాడుతూ కనిపించింది. మృతుడి వయస్సు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నలుపు, ఎరుపు గీతలు ఉన్న ఫుల్ హ్యాండ్ చొక్కా, ఆకుపచ్చ లోయర్ ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు 9121101164 (సీఐ), 9121101203 (ఎస్సై) నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు.
News September 16, 2025
రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.
News September 16, 2025
మెనోపాజ్లో ఈ ఆహారం తీసుకుంటే మేలు!

ప్రతి మహిళకు మెనోపాజ్ దశ తప్పనిసరి. 40 ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా అనేక మార్పులొస్తాయి. అలసట, బరువు పెరగడం, హెయిర్లాస్ మొదలవుతాయి. కాబట్టి విటమిన్ డీ, కే, కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే ఫుడ్స్, ప్రొటీన్ కోసం చికెన్, గుడ్లు, చేపలు తినాలి. వీటితో పాటు గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్, క్వినోవా, పండ్లు, ఆకుకూరలు, ఈస్ట్రోజన్ పెరగడానికి నువ్వులు, అవిసెలు, బీన్స్ డైట్లో చేర్చుకోవాలి.