News February 7, 2025

KMR: పక్కడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ 1st ఇయర్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. ఈ పరీక్షకు జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 9వ తరగతి పరీక్షకు 1739 మంది, ఇంటర్మీడియట్‌కు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News February 7, 2025

యాదాద్రి: అడవి దున్న మృతి..

image

కొద్దిరోజులుగా జిల్లాలో హల్‌చల్ సృష్టించిన <<15388923>>అడవి దున్న<<>> మరణించింది. కొద్ది గంటల క్రితమే చాకచాక్యంగా దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్న అటవీ శాఖ అధికారులు అది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల నుంచి విపరీతంగా తిరగడంతో <<15386379>>దున్న <<>>అనారోగ్యానికి గురై చనిపోయిందని జిల్లా అధికారి పద్మజారాణి పేర్కొన్నారు. ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా పంచనామ నిర్వహించనున్నట్లు చెప్పారు.

News February 7, 2025

తండెల్ సినిమాలో అవకాశం అందుకున్న కన్నెపల్లి వాసి

image

కన్నెపల్లి మండల కేంద్రం ముత్తపూర్‌కు చెందిన హరీష్ మొదట ఢీ జోడిలో సైడ్ డాన్సర్‌గా రాణించారు. అనంతరం శుక్రవారం విడుదలైన తండేల్ సినిమాలో విలన్‌కు సైడ్ క్యారెక్టర్‌గా హరీష్ నటించారు. డైరెక్టర్‌గా చెందు మండేటి, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో నటించారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన హరీష్ చిన్న పాత్రలో కనిపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సినిమాలో కనిపించారు. 

News February 7, 2025

జన్నారం: ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రాపాల రాజు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జన్నారం పట్టణంలోని రామ్ నగర్కు చెందిన డాక్టర్ రాపాల రాజు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. రాపాల రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. 

error: Content is protected !!