News October 31, 2025
KMR: పత్తి కొనుగోళ్లు వాయిదా..సోమవారం షురూ

మద్నూర్ పరిధిలోని 7 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు KMR జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన కొనుగోలు ప్రక్రియ సోమవారం నాడు ప్రారంభం కానుంది. రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. శనివారం, ఆదివారం కొనుగోలు ప్రక్రియ జరగదని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News October 31, 2025
17 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి జరగనున్నాయి. 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 17న ధ్వజారోహణం, చిన్నశేష, 18న పెద్దశేష, హంస, 19న ముత్యపుపందిరి, సింహ, 20న కల్పవృక్షం, హనుమంత, 21న పల్లకీ, గజ, 22న సర్వభూపాల, స్వర్ణరథం, గరుడ వాహన సేవ జరుగుతుంది. 23న సూర్యప్రభ, చంద్రప్రభ, 24న రథోత్సవం, అశ్వవాహనం, 25న పంచమీతీర్థం, ధ్వజావరోహణం.
News October 31, 2025
కాసిపేట: అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

కాసిపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలన్నారు.
News October 31, 2025
అమలాపురం: నవంబర్ 4న జాబ్ మేళా

నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఐటీ రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. వికాస ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నవంబర్ 4వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో వికాస ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరుగుతుందని, ఐటీ రంగ యువత దీనిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


