News March 28, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 22, 2026
సిరిసిల్ల: అప్పుల బాధతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న ఘటన ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమనేని అంజయ్య (42) సొంత ఊరిలో ఉపాధి లేక హైదరాబాదులో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేశాడు. అప్పులు ఎక్కువ అవడంతో మనస్తాపం చెంది స్వగ్రామంలోని ఆయన ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News February 22, 2026
కరెంటు సమస్యలా? ఈ నంబర్కు HI అని మెసేజ్ చేయండి

TGSPDCL వాట్సాప్ చాట్బోట్ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt
News February 22, 2026
పార్వతీపురం: PGRS అర్జీల వివరాల ‘మీ కోసం’

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు ‘మీ కోసం’ వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరిస్తామన్నారు.


