News April 3, 2025
KMR: పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

మద్నూర్లో నిషేధిత అల్ఫాజోలం పట్టుబడ్డ కేసులో ఇది వరకే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ పత్రికలో పని చేసే మరో వ్యక్తి పైయ్యర్ల శ్రీనివాస్ పరారీలో ఉండగా బుధవారం పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News October 23, 2025
259 ట్రాన్స్ఫార్మర్లతో మేడారానికి విద్యుత్ వెలుగులు..!

ఈసారి జరిగే మేడారం మహా జాతరలో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 259 ట్రాన్స్ఫార్మర్లు, 9111 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగేలా లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. 250km పొడవునా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం టీజీ ఎన్పీడీసీఎల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనుంది.
News October 23, 2025
అకాలపు వాన.. అరికల కూడు

ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే వరి అన్నం ఒకప్పుడు చాలా అరుదు. కేవలం ధనికుల ఇళ్లలోనే వండుకునేవారు. సామాన్యులు ఎక్కువగా అరికల అన్నం తినేవారు. కొత్తగా వరి పండించే రోజుల్లో ‘అకాలపు వాన.. అరికల కూడు’ అనే సామెత ప్రాబల్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాన అదును తప్పి కురిస్తే ధనవంతులు కూడా అరికల కూడు తినాల్సిందేనన్నది దీని అర్థం.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి
News October 23, 2025
నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులివే..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధులొచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయంటున్నారు. ముఖ్యంగా బోలుఎముకలవ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మానసిక ఒత్తిడి దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులే వీటికి కారణమంటున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.