News March 21, 2025

KMR: పిడుగు పాటుతో గేదెలు, గొర్రెలు మృతి

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. బిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, లింగంపేట తదితర మండలాల్లో అకాల వర్షం పడింది. లింగంపేట మండలం లింగంపల్లి శివారులో పిడుగు పడింది. పిడుగు పాటుకు 2 బర్రెలు మృతి చెందాయి. లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామ శివారులో పిడుగు పడి మూడు గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.

Similar News

News December 18, 2025

చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ మార్పు

image

TG: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆదిలాబాద్(D) కలెక్టర్ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్‌ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ టైమింగ్స్ మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News December 18, 2025

20న ఒంగోలులో వ్యాసరచన పోటీలు: DEO

image

ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నామని గెలిచిన విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతులు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.

News December 18, 2025

ఎలక్షన్ అబ్జర్వర్‌కు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సన్మానం

image

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ కాళీచరణ్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆయన అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో అబ్జర్వర్ పాత్రను వారు కొనియాడారు.