News March 20, 2025

KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

image

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.

Similar News

News December 21, 2025

వేములవాడ: ఈనెల 24న అరుణాచలం ప్రత్యేక యాత్ర ……

image

వేములవాడ నుంచి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ఈనెల 24వ తేదీన ప్రత్యేక బస్సు యాత్ర ఏర్పాటు చేసినట్లు వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 25న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 26న అరుణాచలం గిరి ప్రదక్షిణ, 27న తిరుమల, 28న జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటాయని, పెద్దలకు రూ. 6100, పిల్లలకు రూ.4850 చార్జీ ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 99959225926 నంబర్ లో సంప్రదించాలన్నారు.

News December 21, 2025

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 30 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్మీ/నేవీ/IAFలో పనిచేసిన అభ్యర్థులు DEC 22 నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 43ఏళ్లు. నెలకు జీతం రూ.20,000-రూ.81,000 చెల్లిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in/

News December 21, 2025

నల్గొండ: మీరు మారరా..?

image

ఉమ్మడి జిల్లాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. అవినీతికి అండగా నిలిచే ప్రధాన శాఖలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15కు పైగానే కేసులు నమోదయ్యాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ వరుసగా దాడులు చేస్తూ జైలుకు పంపుతున్నా, చాలామంది అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.