News December 29, 2025
KMR: ప్రజావాణికి 91 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుంచి స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పంపాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Similar News
News December 31, 2025
పెదబయలు: మత్స్యగెడ్డలో మహిళా డెడ్బాడీ కలకలం

పెదబయలు మండల కేంద్రం సమీపంలోని లకేపుట్టు ఏకలవ్య పాఠశాల వెనక ఉన్న మత్స్యగెడ్డలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా..ఎస్సై వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో డెడ్ బాడీని బయటకు తీయించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆమె ఫొటో ఆధారంగా వివరాలు తెలిస్తే 94409 04227 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
News December 31, 2025
విద్యుత్ షాక్తో సత్యసాయి జిల్లా యువకుడు మృతి

విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల మేరకు.. రొళ్ల మండలం అలుపనపల్లి గ్రామానికి చెందిన శిరీష్ రెడ్డి (26) GN పాళ్యం వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద కనెక్షన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News December 31, 2025
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ఏకాగ్రతతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాహసవంతులైన చిన్నారుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.


