News April 7, 2025
KMR: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 7, 2025
BREAKING: పరీక్ష తేదీలు వచ్చేశాయ్

AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీకి సంబంధించి జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని, జూన్ 20 నుంచి 22 వరకు పరీక్షలు జరగవని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
News April 7, 2025
సింగపూర్ కాన్సులేట్తో ఐటీ మంత్రి సమావేశం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తో సోమవానం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్లను సిద్ధం చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీధర్బాబు తెలిపారు.
News April 7, 2025
విశాఖలో ఏసీబీ దాడులు

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యడెండ్గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.