News April 12, 2026
KMR: ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. ఈ జిల్లాలో మొత్తం 3,945 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 2,372 మంది ఉత్తీర్ణత సాధించి 60.13% ఫలితాలను సాధించారు. బాలుర విషయానికి వస్తే, 3,286 మందిలో కేవలం 1,200 మంది మాత్రమే పాస్ అయ్యి 36.52% ఉత్తీర్ణతకే పరిమితమయ్యారు. ఇక్కడ బాలికలు బాలుర కంటే దాదాపు 23% మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
Similar News
News April 13, 2026
HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.
News April 13, 2026
కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.
News April 13, 2026
మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్?

‘వృషకర్మ’ చిత్రంతో బిజీగా ఉన్న నాగ చైతన్య మరో 2 చిత్రాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో తండ్రి నాగార్జునతో కలిసి మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో హీరోగా తన 25వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది లవ్&మ్యూజికల్ ఎంటర్టైనర్గా ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాలీవుడ్ టాక్.


