News April 1, 2024
KMR: మద్యం తాగి డ్రైవింగ్..మూడు రోజుల జైలు శిక్ష
మద్యం తాగి వాహనం నడుపుతూ..హైదరాబాద్కి చెందిన వ్యక్తి సయ్యద్ సుల్తాన్.. సదాశివనగర్ పోలీసులకి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని పోలీసులు కామారెడ్డి రెండవ తరగతి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రతాప్ ముందు హాజరు పరచగా మూడు రోజుల జైలు శిక్ష, రూ.300 జరిమానాన్ని విధించారు. మద్యం తాగి వాహనాలని నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 5, 2024
NZB: హరీశ్ రావు మాట తప్పారు: మహేష్ కుమార్ గౌడ్
రుణ మాఫీ విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.
News October 5, 2024
NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.
News October 5, 2024
కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.