News March 19, 2025
KMR: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. మార్చ్5 న ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్నకు సంబంధించి 7948 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7719 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1865 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 170 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News November 10, 2025
విజయవాడ బస్స్టాండ్లో బొమ్మ పడబోతోంది.. వచ్చే నెల నుంచే!

విజయవాడ బస్టాండ్లోని రెండు మినీ థియేటర్లు సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరచుకోనున్నాయి. ఇటీవల రూ.2.5 లక్షలకు టెండర్లు దక్కించుకోవడంతో ప్రస్తుతం రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు లేదా డిసెంబర్ తొలి వారంలో సినిమా ప్రదర్శనలు ప్రారంభిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెండు థియేటర్లలో కలిపి 200 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి.
News November 10, 2025
మెట్పల్లి: పెళ్లి చేయట్లేదని తండ్రిని చంపేశాడు..!

మెట్పల్లిలో <<18248546>>కన్నకొడుకు చేతిలో తండ్రి హతమైన<<>> విషయం తెలిసిందే. అయితే హత్యకుగల కారణం పెళ్లి అని SI కిరణ్ తెలిపారు. అన్వేష్ తనకు పెళ్లి చేయాలని తండ్రితో తరచూ గొడవపడేవాడు. ఎంతకీ సంబంధాలు కుదరకపోవడంతో కక్ష పెంచుకున్న కొడుకు తండ్రిపై దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని కుటుంబీకులు NZBలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఉదయం మరణించాడు. మృతుడి మరో సంతానం ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News November 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 62 సమాధానాలు

ప్రశ్న: శిఖండి ఎవరు? ఆమె భీష్ముడి చావునెందుకు కోరింది?
జవాబు: శిఖండి పూర్వజన్మలో కాశీ రాజకుమారి అంబ. ఆమె ఒకర్ని ప్రేమించి, వివాహం చేసుకోవాలి అనుకోగా.. భీష్ముడు బలవంతంగా తనను తీసుకెళ్లి వేరొకరికిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ప్రతిజ్ఞ పూనిన అంబ మరుజన్మలో శిఖండిగా పుట్టి, యుద్ధంలో పాల్గొని, భీష్ముని చావుకు కారణమైంది.
☞ సరైన సమాధానం చెప్పినవారు: కృష్ణ, నల్గొండ.
<<-se>>#Ithihasaluquiz<<>>


