News January 19, 2025
KMR: మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో 4 నెలలు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను వచ్చే నెల 15వ తేదీ లోపు కామారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 4, 2025
సంగారెడ్డి: ‘లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి’

ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్లో కక్షిదారులు తమ బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ఫండ్స్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. సంగారెడ్డి కోర్టులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
News November 4, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.
News November 4, 2025
సంగారెడ్డి: ఉన్నత చదువులు.. 30 మంది టీచర్లకు అనుమతి

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 30 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


