News February 12, 2025
KMR: యాక్సిడెంట్లో వ్యక్తి మృతి

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ రమేశ్ పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
మున్సిపల్ పోరు: రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రులు ఆధిపత్యం చాటుతూ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తుండగా.. నిర్మల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరి కళ్లు రెండో రౌండ్ ఫలితాలపైనే ఉన్నాయి. తుది ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయో వేచి చూడాలి.
News February 13, 2026
హైకోర్టులో పేర్ని నానికి చుక్కెదురు.!

మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం, డిప్యూటీ సీఎంలను దూషించారంటూ మచిలీపట్నం ఇనగుదురు పీఎస్లో నానిపై నమోదైన కేసులో పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నమోదైన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించినవి కావడంతో క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది.
News February 13, 2026
BREAKING: లక్షెట్టిపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


