News November 10, 2024
KMR: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలంలో జరిగింది. ఎస్సై రంజిత్ కథనం ప్రకారం.. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన మొగ్గం శ్రావణ్ (24) కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News November 14, 2025
ఆర్మూర్: విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయండి: DIEO

ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంటర్ బోర్డు కమిషనర్ సూచించిన మేరకు ప్రతి అధ్యాపకుడు ఉద్యోగి విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
News November 14, 2025
NZB: ఇది ప్రజా విజయం: మహేష్ కుమార్ గౌడ్

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజా విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం అయినా నిజామాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసముంచి తమ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సంకేతమని అభివర్ణించారు.
News November 14, 2025
NZB: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: మహేష్ కుమార్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం తమదేనన్నారు. GHMC ఎన్నికలలోనూ ఇదే ఫలితాలు వస్తాయని, రాబోయే ఏ ఎన్నిక అయినా ఫలితం కాంగ్రెస్ దే నన్నారు. BRSకు ప్రజలు సెలవు ఇచ్చారని, ఆ పార్టీకి స్థానం లేదన్నారు. బీహార్ ఎన్నికలపై పూర్తి ఫలితాలు వచ్చాక స్పందిస్తానని అన్నారు.


