News February 11, 2025
KMR: ‘యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం’: షబ్బీర్ అలీ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ MLC స్థానానికి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డిను పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Similar News
News November 7, 2025
నరసరావుపేట: వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. సహజ సౌందర్యం నడుమ అధికారులు ఆనందంగా గడిపారు.
News November 7, 2025
ఆసిఫాబాద్: ‘పెండింగ్ సమస్యలను పరిష్కరించండి’

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆసిఫాబాద్లో ఈరోజు ఏటీడీవో శివకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
News November 7, 2025
వాలీబాల్ జట్టుకు ఎంపికైన ములుగు జిల్లా క్రీడాకారులు

ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ జట్టుకు ములుగు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరగనున్న తెలంగాణా సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్కు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ములుగు జిల్లా వాలీబాల్ క్రీడాకారులు.. నాలి తరుణ్, కొమరం ఉదయ్, గొంది వసంత్, సోయం నర్సింహ, కొమరం సునీల్, శివ, నరేందర్ ఎంపికయ్యారు.


