News June 14, 2024
KMR: రక్తదాన దినోత్సవం.. 73 సార్లు రక్త దానం చేసిన బాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718341623756-normal-WIFI.webp)
KMR జిల్లాకు చెందిన డా.బాలు రక్త దాతల సమూహాన్ని 2007లో ఏర్పాటు చేశారు. వాట్సప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఆపదలో ఉన్న వారికి వీరు రక్తం అందిస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2yrsలో 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఫలితంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు డా. బాలు 73 సార్లు రక్త దానం చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
Similar News
News February 10, 2025
బాల్కొండ: వరద కాలువలో వ్యక్తి గల్లంతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739115621326_50139228-normal-WIFI.webp)
బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోవడంతో నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపి వేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం వరకు 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.
News February 10, 2025
ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739093362853_51712009-normal-WIFI.webp)
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.
News February 10, 2025
NZB: గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన పనులను కొనసాగించాలి: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739111335346_50139228-normal-WIFI.webp)
బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.